క‌రోనా కాలంలో మ‌ల‌బార్ సేవ‌లు అభ‌నింద‌నీయం: ప‌్ర‌భుత్వ విప్ గాంధీ

నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌, మ‌ల‌బార్ గోల్డ్ ప్ర‌తినిధులు

పీజేఆర్ న‌గ‌ర్‌లో నిరుపేద‌ల‌కు మ‌ల‌బార్ గోల్డ్ నిత్యావ‌సర స‌రుకుల‌ పంపిణీ
ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్‌ నగర్ కాలనీ లో మలబర్ గోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యాఅవస సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వ‌హించారు. స్ధానిక గౌరవ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ స‌రుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మలబర్ గోల్డ్ నగల వ్యాపార సంస్థ లాభం లోని కొంత మొత్తాన్ని పేద ప్రజలకు వివిధ రూపాలలో అందచేయడం గర్వకారణమ‌ని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సుమారుగా 500 మంది పేద ప్రజలకు వారానికి సరిపడా నిత్యావసరాల సరకులు అందచేయడం చాల అభినందించ దగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం పస్థులు ఉండొద్దు అనే ఏకైక ఉద్దేశ్యం తో ముఖ్యంమత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారి సంకల్పం తో ఉచితంగా బియ్యం మరియు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రజలకు భోజనాలు అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్‌వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ , తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ , కాశీనాథ్ యాదవ్ ,రాజేష్ చంద్ర,వాసు ,మధు,బోయ కిషన్,కుమారి, మంజుల, శిరీష తదితరులు పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, వేధిక‌పై కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌, మ‌ల‌బార్ గోల్డ్ ప్ర‌తినిధులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here