ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి: బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఓటరు నమోదు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంతోమంది పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన వారు, తమ ఓటును ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారని, వారి కోసం ఓటర్ నమోదు శిబిరాన్ని ప్రారంభించామని తెలిపారు. నూతనంగా ఇచ్చిన ఓటర్ లిస్టులో కొంతమంది తమ ఓటును కోల్పోయారని పేర్కొన్నారు. అందరూ తమ ఓటు ఉన్నదో లేదో తెలుసుకుని, తిరిగి తమ ఓటును పొందవచ్చని తెలిపారు. లింగంపల్లి గ్రామంలోని అందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు ఉన్నదో లేదో తెలుసుకుని ఓటు కోల్పోయిన వారు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంటేస్టడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేశ్, ప్రణయ్, వినోద్ యాదవ్, కిట్టు, రంజిత్, చిన్నా ముదిరాజ్, రవీందర్ ముదిరాజ్, రఘు చారి, సాయి పాల్గొన్నారు.

ఓటు నమోదు శిబిరంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here