మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరిక

  • గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : సీఎం కేసిఆర్ మాయమాటలు మోసపూరిత హామీలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని , కేసిఆర్ కుటుంబ , రాచరికపు పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ తెలిపారు. గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో భాగంగా ఇందిరా నగర్ , జి.పి.ఆర్. ఏ క్వార్టర్స్ కాలనీలలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి పర్యటించగా.. ప్రజలు ఘన స్వాగతం పలికారు. సందర్బంగా కేంద్ర, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అవినీతిని తెలియజేస్తూ, ప్రజల ప్రేమ, ఆప్యాయతల నడుమ పాదయాత్ర కొనసాగించారు.

ప్రజలకు పార్టీ కరపత్రాలను పంచి పెడుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

గచ్చిబౌలి డివిజన్ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు తెలిపారు. గంగాధర్ రెడ్డి ఎన్నికైన 2 సంవత్సరాలలో ప్రభుత్వంతో కొట్లాడి అనేక సమస్యలు పరిష్కరించారని రవికుమార్ యాదవ్ తెలిపారు. కానీ ఎన్నికల ముందు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు , డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టు పి.జి ఉచిత విద్య , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇలా అనేక హామీలు ఇచ్చి అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రమేష్, మఖన్ సింగ్, విశాల్ సింగ్, సుకుమార్, రవి, విశ్వనాథ్, సాయి, సాయి, శివ, భరత్, భగత్ సింగ్, గౌతమ్, గోపాల కృష్ణ, రాజు, వరలక్ష్మి, పద్మ, శివాసింగ్, గోపాల్, అరవింద్, సంకేశ్, బబ్లూ సింగ్, అరుణ్ గౌడ్, రంగ స్వామి, మధు యాదవ్, రవి నాయక్, సాయి, నవీన్ రెడ్డి, రవి, గణేష్ ముదిరాజ్, నరసింహ, జే. శ్రీను, బసవ రాజ్, స్థానిక వాసులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో బీజీపీ శ్రేణులతో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here