చిత్తశుద్ధి ఉంటె సమస్యలు పరిష్కరించండి

  • బిజెపి ప్రజా ఆశీర్వాద యాత్రలో మొవ్వ సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ లో అడుగడుగునా సమస్యలు ఉన్నాయని కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ అన్నారు. మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్, హనుమాన్ టెంపుల్ నుంచి కొనసాగిన ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు.

ఇంటింటికి తిరుగుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ సందర్బంగా దోమలు, కుక్కల బెడద, అస్తవస్థమైన రోడ్లు తదితర అంశాలను స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు గల్లీల్లో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని, అధికారులను వేసుకువచ్చి హడావుడి చేస్తే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. బీఆర్ ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.


ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కొరదల నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు డీఎస్ ఆర్ కె ప్రసాద్, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మాదాపూర్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదనచారి, గోవర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శైలం, ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు జంగయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు ఆనంద్, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చిట్టా రెడ్డి ప్రసాద్, రాముసుబ్బారెడ్డి, సత్యనారాయణ, మచ్చా రాజేష్, పృథ్వి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here