మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం అయ్యప్ప సొసైటీ క్లబ్ అసోసియేషన్ కార్యాలయంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్వర్గౌడ్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవాధ్యక్షులు శ్రీనివాస్గౌడ్లతో సభ్యత్వ నమోదు చేయించారు. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, నాగేశ్వరరావు, సాంబశివరావు, లాలూ నాయక్, వెంకట్రామిరెడ్డి, నారాయణరెడ్డి, కోటేశ్వరరావు, బాబూమియా, నర్సింగ్ రావు, సాదిక్, నూరుద్దీన్, అలీ, జి.వి రెడ్డి, సలీం, శ్రీనివాస్, ప్రభాకర్, గోపాల్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నాయీమ్, ఖాసీం, ముఖ్తర్, దుర్గ రావు, సంజీవ్ రెడ్డి,శ్యామ్, బుజంగం, కృష్ణ యాదవ్, శంకర్ రావు, వెంకటేష్ గుప్త, అశోక్ గుప్త, కృష్ణ , ఓ,కిషన్, రెహ్మాన్, రామాంజనేయులు, సార్వార్, బ్రమయ్య యాదవ్, కృష్ణ తైలి, కృష్ణ నాయక్, సాంబయ్య, శ్రీనివాస్ గుప్త, సుబ్బు, అజిజుద్దీన్, చందు, స్వామి, పితాని శ్రీనివాస్, ఖాజా, సెల్వరాజ్, రమేష్ రెడ్డి, కోటేశ్, ప్రసాద్, అమీర్, శ్రీనివాస్ నాయక్, వెంకటేష్ నాయక్, నాగరాజ్, మహిళలు ఉమాదేవి, శశిరేఖ, మొగులమ్మ, విజయలక్ష్మి, శ్రీజ రెడ్డి, సీతమ్మ, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
