పక్కా ప్రణాళికలతో అభివృద్ధి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదరనగర్, వివేకానంద నగర్, అల్విన్ కాలనీ, కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని కాలనీ, బస్తిలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికాలు సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్ ని కోరారు.

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ తో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తదితరులు

అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, శేరిలింగంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

అభివృద్ధిపై జోనల్ కమినర్ తో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వర రావు, కూన సత్యం గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, నాగేశ్వరరావు, సిందాం శ్రీకాంత్, ఉప్పల విద్యాకల్పనా ఏకాంత్ గౌడ్, భాషిపాక నాగమణి యాదగిరి, మరెళ్ల శ్రీనివాస్, బసంత్ రాజ్, శిరీష్ సత్తూర్, అరుణ, ప్రభాకర్, ముకయ్య, వెంకటస్వామి సాగర్, ఆల్వాల భాస్కర్, పరుశురాం, శశి, దుర్గా రావు, వెంకటేష్, కావూరి ప్రసాద్, వెంకన్న, కొఠారి వెంకట్, వెంకన్న, ఏనాథ్, సాదిక్, ప్రభాకర్, దుర్గన్న, రాజు, వసీం, పల్నాటి అశోక్, ఎల్లారెడ్డి, కన్నా రావు, శివ, ఉదయ్ రావు, ఎస్ పి పరుశురాం, రవి, వెంకటేష్, యూసఫ్, లక్ష్మి, శాంసన్, రాజు, స్వాతి, యమున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here