మొవ్వ సత్యనారాయణ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్లలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ప్రగతి ఎంక్లేవ్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

శేరిలింగంపల్లి ప్రజలు సుఖసంతోషాలతో, అష్టఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఎస్ ఆర్ కె ప్రసాద్, సత్యనారాయణ, సాంబయ్య, గిరి, శ్రీధర్, మహేష్, గోపి, పృథ్వి, ప్రశాంత్, రాంప్రభూ, హనుమయ్య చౌదరి, ప్రేంచంద్, నాగరాజు, స్వామి, రాజేంద్ర ప్రసాద్, రమన, నాయుడు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here