రాజ్యాంగం ఒక వరం: ప్రభుత్వ విప్ గాంధీ

  • ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండావిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 74వ భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ CI తిరుపతి రావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండావిష్కరణ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
జాతీయ జెండా కు వందనం సమర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 73 ఏళ్ళుపూర్తి చేసుకొని74 వ వసంతం లోకి అడుగు పెడుతున్నామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు 74 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం కార్పొరేటర్లు నాయకులతో ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here