బాబ్రీ మసీదు తీర్పు కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టు : నంద కుమార్ యాదవ్

సంబరాలు జరుపుకుంటున్న బిజెపి శ్రేణులు

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): బాబ్రీ మసీదు పై సీబీఐ న్యాయస్థానం వెలువరించిన తీర్పు కుహనా లౌకికకాదులకు చెంపపెట్టు వంటిదని ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాకార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్ ల ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించిందని ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారని గుర్తుచేశారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం కేసులో సరైన న్యాయం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి రాష్ట్ర నాయకురాలు నర్రా జయలక్ష్మి, జిల్లా నాయకులు చింతకింది గోవర్దన్ గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు పాండు గౌడ్, బాబు, బాలు, పట్లోల్ల నర్సింహ, సీనియర్ నాయకులు నిరేటి చంద్రమోహన్ శివకుమార్, స్వామి గౌడ్, మహేందర్, అరవింద్ గౌడ్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మిఠాయిలు పంచుకుంటున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here