ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ నాయకత్వంలో గోపనపల్లిలోని మంజీరా డైమండ్ హైట్స్‌ లో స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. గావ్ ఛలో – బస్తీ ఛలో కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపడం, వారి అభివృద్ధికి తోడ్పడడం మా బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల్లో ప్రజలకు చేసింది ఏమి లేక రాజ్యాంగం ముసుగులో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయో తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇంతలా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారే స్థాయికి చేరింద‌న్నారు.

ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, రంజిత్ పూరి, హనుమంత్ నాయక్, కిషన్ గౌలి, ప్రభాకర్, తిరుపతి, రాజు, గోవింద, మహేష్ , వరలక్ష్మి ధీరజ్, మంజీర డైమండ్ హైట్స్ వాసులు అతుల్ పీఎల్ రావు, సుమంత్, అర్జున్, వరప్రసాద్, మదన్, క్రాంతి, రఘు, ఉదయలక్ష్మి, శశి, ప్రియ, తులసి, హేమ, శ్రీలక్ష్మి, రజినీ, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here