స్వర్ణ హైట్స్ అపార్ట్ మెంట్ లోని సమస్యల‌ను పరిష్కరిస్తాం – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అవసరమయ్యే‌ కనీస మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి స్వర్ణ హైట్స్ అపార్ట్ మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అపార్ట్ మెంట్ లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ కు విన్నవించారు. భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు,‌ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.‌ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

స్వర్ణ హైట్స్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

స్వర్ణ హైట్స్ అపార్ట్మెంట్ వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం వ్యవస్థ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.‌ ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ టవర్స్ అధ్యక్షుడు శ్రీజిత్ నైర్, సంయుక్త కార్యదర్శి సిద్దార్థ్ రంబద్రి, కార్యనిర్వాహక సభ్యుడు వివేక్ సింగ్, స్వర్ణ హైట్స్ వాసులు, ఎ.సి.పి. రావు, వివేక్ సింగ్, శ్రీనివాస్, కిశోరె, సాంబశివ రావు, సతీష్, మనోజ్, జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అపార్ట్మెంట్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here