చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో వనమహోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను నిర్వహించారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో కలిసి వనమహోత్సవం నిర్వహించిన సీఐ తిరుపతి రావు

75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ తిరుపతి రావు, చందానగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ క్యాస్ట్రో, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తో కలిసి వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ లలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ కాంతా రెడ్డి, ఎస్ఐలు తదితరులు ఉన్నారు.

చందానగర్ పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటుతున్న సీఐ క్యాస్ట్రో

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here