శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు రక్షాబందన్ శుభాకాంక్షలు – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికి‌ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదర భావాన్ని బలోపేతం చేసే రక్షా బంధన్ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అన్న చెల్లెలకు, అక్కా తమ్ముళ్లకు, ప్రజలకు, ఆత్మీయ సోదర సోదరీమణులకు, ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అక్కాతమ్ముళ్ల, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా, ఆత్మీయ అనురాగానికి సంకేతమైన రాఖీ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్నాతమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసా భావన రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని అన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సహోదర భావం మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here