కేబుల్ బ్రిడ్జి పై నుంచి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 25 నుండి 30 ఏండ్ల వయస్సు గల గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. లేక్ పోలీసు వారి సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీయించి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మహిళ కనకాంబరం రంగు టాప్, ఎరుపు రంగు లెగ్గింగ్, నలుపు చారల చున్ని ధరించి ఉంది. ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది. మహిళ ఆచూకీ తెలిసిన వారు మాదాపూర్ పోలీసు వారిని 8331013220 నంబర్ పై సంప్రదించవచ్చని అన్నారు.

    గుర్తు తెలియని మహిళ మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here