శిల్పారామంలో ఆకట్టుకున్న త్యాగరాజ ఉత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామం ఎథ్నిచ్ హాల్ లో కీర్తన ఇన్ స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్, గౌడియం స్కూల్ సంయుక్త నిర్వహణలో త్యాగరాజ ఉత్సవం నిర్వహించారు. శేషాచారి, కమలా రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన త్యాగరాజ ఉత్సవంలో కౌశిక్ కళ్యాణ్ గాత్రం, వయోలిన్ పవన్ సింగ్, మృదంగం కృష్ణ శ్రవణ్, మల్లెల శ్రీక్రాంతి స్వరూప్ గాత్రం, వయోలిన్ సాయి కోలంక, మృదంగం శ్రీనివాస గోపాలం త్యాగరాజ కీర్తనలు గాత్ర కచేరి పలువురిని అలరించింది. సాయంత్రం విద్వాన్ పద్మ విభూషణ్ పండిట్ బిర్జు మహారాజ్ కు హైదరాబాద్ లో ఉన్న కథక్ కళాకారులందరూ నృత్య నీరాజనం అర్పించారు. సుబ్రత్ సర్కార్ శిష్య బృందం, యోగిని కార్నోహాకర్, ఆర్తి శంకర్ శిష్య బృందం, కుమారి మిత బృందం, సంజయ్ జోషి శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శనలో గణేశా వందన, కృష్ణ వందన, గురు భజన, టీన్ తాళ్, అల్బెల సాజన్, తదితర అంశాలతో నృత్య నీరాజనం అర్పించారు.

త్యాగరాజ ఉత్సవంలో గేయాలాపన చేస్తున్న చిన్నారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here