సీతారాముల‌ కల్యాణోత్సవం లో‌ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా‌ వస్తోందని గచ్చిబౌలి డివిజన్ ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రూపరెడ్డి దంపతులు
కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భక్తుల‌ కోసం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి గ్రామస్థులు, భక్తులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సీతారాముల‌ కళ్యాణోత్సవం జరిపిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here