నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వరా నృత్యనికేతన్ గురువర్యులు ప్రతిభారాజ్ గౌడ్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. శ్రీ విజ్ఞ రాజన్ భజేయఁ, ముద్దుగారేయ్ యశోద, నీలమేఘ శరీర, తిల్లాన, జాలరులు కురియగా, గాయత్రీ మంత్రం, భామాకలాపం, భారతవేదముగా, శివ స్తుతి, తరణ తిల్లాన తదితర అంశాలతో కళాకారిణీలు నేహా, శ్రేయ, ఐశ్వర్య, పూజ, ఉమా లలిత, కీర్తన, వర్షిణి, సంజన, అక్షిత, సాహితి, గాయత్రీలు న్యుత్యాభిమానులను మెప్పించారు.
