నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హిమ సాయి అపార్ట్మెంట్స్లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు డ్రైనేజీ ఔట్ లెట్, రోడ్డు సమస్యను గాంధీ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీని పై స్పందించిన ప్రభుత్వ విప్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, రోడ్డు మరమ్మత్తుల ఏర్పాటు కు కృషి చేస్తానని, అదేవిదంగా కాలనీలోని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు,హేమ సాయి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ హరీష్ ధర్మరాజు, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ వోలెటి, ట్రెజరర్ రజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
