రాజీవ్ గాంధీకి శేరిలింగంప‌ల్లి కాంగ్రేస్ నేత‌ల‌ ఘ‌న నివాళి… వ‌ర్ధంతి సందర్భంగా మాస్కుల పంపిణీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాంగ్రెస్‌పార్టీ శేరిలింగంప‌ల్లి స‌మ‌న్వ‌యక‌ర్త ర‌ఘునంద‌న్‌రెడ్డి ఆద్వ‌ర్యంలో గంగారం హుడాకాల‌నీలోని రాజీవ్‌గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వాహ‌న‌దారుల‌కు, పాద‌చారుల‌కు మాస్కుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునంద‌న్ రెడ్డి మాట్లాడుతూ భార‌తీదేశ అభివృద్ధిలో రాజీవ్‌గాంధీ పాత్ర మ‌రిచిపోలేనిద‌ని, సూర్య‌చంద్రులున్నంత వ‌ర‌కు ఆయ‌న కిర్తీ కొన‌సాగుతుంద‌ని అన్నారు. నివాళుల‌ర్పించిన వారిలో ఆ పార్టీ కంటెస్టెండ్ కార్పొరేట‌ర్లు ఇలియాస్ ష‌రీఫ్‌, మారెళ్ల శ్రీనివాస్, టీపీసీసీ మైనారిటి వైస్ చైర్మ‌న్ అయాజ్ అహ్మ‌ద్‌ఖాన్‌, మ‌హ్మ‌ద్ జ‌హాంగీర్ శేరిలింగంప‌ల్లి మైనారిటీ చైర్మ‌న్‌, నాయ‌కులు రంగారెడ్డి, నారాయ‌ణ‌, సునిల్‌, స‌లీం త‌దిత‌రులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నివాళులర్పిస్తున్న ర‌ఘునంద‌న్‌రెడ్డి, ఇలియాస్ ష‌రీఫ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here