శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అభిమానుల మద్య కేక్ కట్ చేసి,పెద్దలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్ పాల్గొన్నారు.