రామ‌మందిర నిర్మాణ నిధికి పురుషోత్తం స‌గ‌ర రూ.1 ల‌క్ష అంద‌జేత

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణ జనజాగరణలో భాగంగా శనివారం బిజేపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్‌గౌడ్, ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణమూర్తి, జిల్లాపరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ లు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శ్రీధితి ఔట్ సోర్సింగ్ సర్వీసెస్, జేపీటి ప్రాజెక్ట్స్ అధినేత మోడల పురుషోత్తం సగర ను కలిశారు. మందిర నిర్మాణ నిధి సమర్పణలో తన వంతుగా రూ.1 లక్ష చెక్కును అందజేశారు. రామకార్యంలో భాగస్వామ్యులైన పురుషోత్తంకి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.

రామ‌మందిర నిర్మాణ నిధికి రూ.1 ల‌క్షను అంద‌జేస్తున్న పురుషోత్తం స‌గ‌ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here