శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ బస్తీ దవాఖానాలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్, డాక్టర్స్ కాలనీవాసి ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ 5 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు తప్పకుండా పోలియో డ్రాప్స్ వేయించాలని వారు కోరారు.






