చందానగర్‌ సర్కిల్ కార్యాల‌యంలో ప్ర‌తి ఆదివారం ఆస్తి ప‌న్ను ప‌రిష్కారం కార్య‌క్ర‌మం

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాంషు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జనవరి 24, 21, ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 7, 14, 21, 28 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆస్తి పన్నుపై తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగిం చేసుకోవాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here