ప్ర‌ధాని మోదీ చిత్రానికి పాలాభిషేకం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అంద‌రికీ ఆమోద‌యోగ్యంగా ఉంద‌ని, ఇది పేద‌ల బ‌డ్జెట్ అని ప‌లువురు బీజేపీ నాయ‌కులు అన్నారు. మియాపూర్‌లోని ఆర్‌బీఆర్లో డివిజ‌న్ బీజేపీ అధ్య‌క్షుడు ఆకుల ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో ప్రధాని మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపి ఓబీసీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, రాష్ట్ర మాజీ కౌన్సిల్ మెంబర్ కలివేముల మనోహర్, రంగారెడ్డి జిల్లా గీత సెల్ కన్వీనర్ టి రవి గౌడ్, ఎస్టి మోర్చా జిల్లా జనరల్ జనరల్ సెక్రెటరీ విజేందర్ సింగ్ , డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆకుల మహేష్ , మాణిక్యరావు, రంగారెడ్డి జిల్లా అర్బన్ కౌన్సిల్ సభ్యుడు చాడ కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు సురేష్ ముదిరాజ్, కోడెల ప్రసాద్ రాఘవేంద్ర , మన్యం , డేవిడ్ , వెంకట్ శీను , రాము , రాహుల్ , మహేష్ యాదవ్ , ముఖేష్ గౌడ్ , భాషా పతి , చందు నాగేశ్వరరావు , సూర్య నాయక్ , అప్పారావు , ప్రభాకర్ , రమేష్ , అభిషేక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here