వ‌న్ నేషన్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ సాధ్య‌మే: ర‌వి కుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశాభివృద్ధికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంతో అవసరమ‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ బాల్దా అశోక్ సమక్షంలో పట్టాభిరాం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్, వీడియో కాలనీ, జె.పి నగర్ , దోవా కాలనీల సంక్షేమ సంఘ అధ్యక్షులు, సభ్యులతో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. 1984 లోనే కోరిందని మెజారిటీ లేకపోవడం వలన కాలేదని, జమిలి ఎన్నికల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఎన్నికల ఖర్చు తగ్గింపు, ప్రభుత్వ పాలసీల అమలుకు అంతరాయం ఉండదని, ఎన్నో పెట్టుబడులను తెచ్చుకోవచ్చని అన్నారు.

స్వీడన్,దక్షిణాఫ్రికా,USA మిగతా దేశాలలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్థారని గుర్తు చేసారు. 2024 లోక్ స‌భ ఎన్నికల అంచనా వ్యయం ₹1.35 లక్ష కోట్లని, జమిలి ఎన్నికల వల్ల ₹4.5 లక్ష కోట్లు మిగులుతాయ‌ని పేర్కొన్నారు. మొదటి దశలో లోక్ స‌భ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించి తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. దీనికోసం ఆర్టికల్ 82A, 83, 172, 327 రాజ్యాంగ సవరణలు అవసరమన్నారు. దీని వలన విభిన్న పార్టీల ప్రాధాన్యత తగ్గిపోతుందనే విమర్శలు ఉన్నాయి కానీ స్థానిక పార్టీల ప్రాముఖ్యతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అన్ని అనుకులంగా జరిగితే 2029 నాటికి అమలు చేస్తే 2034 నాటికి పూర్తి స్థాయిలో అమలు అవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్ , మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్, సీనియర్ నాయకులు మనోహర్ , మాణిక్ రావు, వెంకటస్వామి రెడ్డి, గణేష్, కిరణ్ కుమార్ రెడ్డి, , ప్రభాకర్ రావు, విజయేందర్, పాపయ్య, మహేష్, వివిధ కాలనీల సంక్షేమ సంఘ సభ్యులు బాబు, వేంకటేశ్వర రావు, అజయ్ కుమార్, పుల్లారావు, సంజయ్ కుమార్, అంకమ్మ చౌదరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here