చిరుత సంచారం వార్త‌ల‌పై భ‌యాందోళ‌నలు చెందాల్సిన అవ‌స‌రం లేదు: కొమిరిశెట్టి సాయిబాబా

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి ప్ర‌జ‌లు చిరుత సంచరిస్తుంద‌న్న వార్త‌ల ప‌ట్ల భ‌య ప‌డాల్సిన ప‌నిలేద‌ని డివిజ‌న్ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని రోడా మిస్త్రీ క‌ళాశాల ప‌రిస‌రాల్లో చిరుత సంచ‌రిస్తుంద‌న్న వార్త‌ను తెలుసుకున్న ఆయ‌న సోమ‌వారం క‌ళాశాల‌కు వెళ్లారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ సునంద మూర్తిని క‌లిశారు. చిరుత‌పులిని చూశాన‌ని తెలిపిన సిబ్బంది క‌ళావ‌తిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

రోడామిస్త్రీ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ సునంద మూర్తితో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా

అనంత‌రం కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ.. రోడా మిస్త్రీ క‌ళాశాల ప‌రిస‌రాల్లో అట‌వీ శాఖ అధికారులు క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తున్నార‌ని అన్నారు. ఆ ప్రాంతంలో ఎక్క‌డిక‌క్క‌డ ట్రాకింగ్ కెమెరాల‌ను ఏర్పాటు చేశార‌ని, అందువ‌ల్ల ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here