నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయిన సందర్భంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జీహెచ్ఎంసీ ద్వారా వంద శాతం వ్యాక్సినేషన్ ప్రశంసా పత్రాన్ని కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ కు అందజేశారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నేతాజీ నగర్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసినందుకు కాలనీ వాసులకు, అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ యాదవ్ మాట్లాడుతూ నేతాజీ నగర్ లో ప్రజలందరూ కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలని కాలనీ అసోసియేషన్ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుల్ మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు ఖాసీం, ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మోహన్ రావు, జై రాజ్ సింగ్, వెంకట్ రెడ్డి, నేతాజీ నగర్ ఉపాధ్యక్షుడు రాయుడు, ఎండి కమర్, పాషా, ప్రభాకర్ చారి, టీ కుమార్, రమేష్ గుప్తా, వెంకటేష్, అనంతయ్య, సూపర్ వైజర్ భరత్ రెడ్డి, రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/09/IMG-20210906-WA0038.jpg)