మధ్యలో ఆపేసిన పనులను పూర్తి చేయండి: డీసీ సుధాంషుకు ఎంసీపీఐయూ వినతి

నమస్తే‌ శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంసీపీఐయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం చందానగర్ డీసీ సుందాంష్ ను కలిసి పలు సమస్యలతో కూడిన‌ వినతి పత్రాన్ని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదబాద్ కమిటీ సభ్యులు పల్లె మురళి, మియాపూర్ వాసులు అశోక్ నాగరాజ్ అందజేశారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మూడేళ్లు గడుస్తున్నా ఫలితం లేదన్నారు. అరకొర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేసి సీసీ రోడ్డు పునర్నిర్మాణం చేయకుండా వదిలేశారన్నారు. మధ్యలో నిలిపివేసిన పనులను వెంటనే ప్రారభించాలని డిమాండ్ చేశారు.

చందానగర్ డీసీ సుధాంష్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎంసీపీఐయూ ‌నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here