న‌ల్ల‌గండ్ల‌, నాన‌‌క్‌రామ్‌గూడ గ్రామాల‌లో ప‌ర్య‌టించిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డికి స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న న‌ల్ల‌గండ్ల గ్రామ‌స్థులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్‌రెడ్డి బుద‌వారం న‌ల్ల‌గండ్ల‌, నానక్‌రామ్‌గూడ గ్రామాల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రెండు గ్రామల ప్ర‌జ‌లు కార్పొరేట‌ర్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. అనంత‌రం స్థానిక పెద్ద‌ల‌తో క‌ల‌సి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి గ్రామాల‌లో పాద‌యాత్ర నిర్వ‌హించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను గ్రామ‌స్థులు కార్పొరేట‌ర్‌కు వివ‌రించారు. ప్ర‌ధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల స‌మ‌స్య‌ను గుర్తించిన గంగాధ‌ర్‌రెడ్డి ప్రాధాన్య‌తా క్ర‌మంలో వాట‌న్నింటిని ప‌రిష్క‌రిస్తాన‌ని స్థానికుల‌కు హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

నాన‌క్‌రామ్‌గూడ‌లోస్థానిక పెద్ద‌ల‌తో పాద‌యాత్ర చేస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here