వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ సూచించారు. వర్షాకాలం సందర్భంగా గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం వచ్చే ప్రమాదముందని అన్నారు. ఈదురు గాలుల వలన చెట్లు, కరెంట్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పనులుంటే తప్పా ప్రజలు బయటకు రావొద్దని అన్నారు. రోడ్ల పై మ్యాన్ హోల్స్, నాలాలు వర్షపు నీటితో నిండి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలన్నారు. అధికారులు, బిజెపి భాజపా కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here