నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత కు శేరిలింగంపల్లి టీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత స్వగృహంలో కలిసి శాలువా, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీ గా కవితకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు మల్లారెడ్డి, సంగారెడ్డిలు కృతజ్ఞతలు తెలియపరిచారు.
