- రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎస్ఎన్ రవిందర్
నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో తాను గుర్తించిన అనేక సమస్యలను, వాటి వల్ల వివిధ వర్గాల వారు పడుతున్న అవస్థలను, వాటికి తనవద్ద ఉన్న పలు పరిష్కార మార్గాలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళదాం అనుకున్నాడు. ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూసాడు. ఇక లాభం లేదనుకొని పెద్దల సభలో ప్రాతినిథ్యం లభిస్తే తప్ప తన ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేనని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనే శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎస్ఎన్ రవిందర్.
ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ రవిందర్ నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని గుల్మోహర్ పార్క్లో నివాసం ఉంటున్నాడు. మైత్రీనగర్లోని శ్రీకర హాస్పిటల్లో క్లీనికల్ కార్డియాలజిస్ట్గా సేవలందిస్తున్నాడు. అదేవిధంగా మదీనగుడలో శ్రీ సాయిశ్రీనివాస కార్డియాక్ క్లినిక్ను నిర్వహిస్తున్నాడు. వైద్యసేవలో కొనసాగుతున్నప్పటికి సమాజంపై భాద్యతాయుతమైన దృష్టికోణాన్ని ఏర్పరుచుకున్నాడు డాక్టర్ రవిందర్. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను విజయం సాధిస్తే పలు అంశాలను చట్టసభలో చర్చిస్తానని, ఈనెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లోని 73వ సీరియల్ నెంబర్పై తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.
డాక్టర్ పీఎస్ఎన్ రవిందర్ పెట్టుకున్న లక్ష్యాలు…
- గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం కోసం తెలంగాణ స్టేట్ హాస్పిటల్ ఇన్ఫాస్ట్రక్చరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
- ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించి, పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఆయుర్వేద విభాగం ఏర్పాటు
- ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్న ఉపాధ్యాయుల(విద్యా దాతలు) కోసం ఈహెచ్ఎస్, పీఎఫ్ ఇతర సౌకర్యాల కల్పన
- నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లతో ప్రోత్సహించి దేశీయ ఉత్సాధకతను పెంచడం