- ఉరి వేసుకోని ద్యారంగుల చంద్ర…
నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోపన్ పల్లి ప్రాంతానికి చెందిన ద్యారంగుల చంద్ర(48)కు భార్య ఓ కొడుకు, కూతురు సంతానం. కాగా బుదవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. స్థానికులు అతడిని స్థానిక సిటిజెన్ హాస్పిటల్ తరలించారు. కాగా అప్పటికే చంద్ర మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే కుటుంబ కలహాల కారణంగానే చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

యాసిడ్ సేవించి మజలి నాగరాజు…
చందానగర్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన మజలి నాగరాజు(35) భార్య ఇద్దరు కూతుర్లు సంతానం. కుటుంబ కలహాల కారణంతో ఈ నెల 2న యాసిడ్ సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కాగ అతడిని ఉస్మానియా దవఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
hellO Bhayya
Good covarage.