జాతిపిత మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం : జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ‌ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మహాత్ముని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, గాంధీజీ చూపిన అహింసా మార్గంలో అంతా నడవాలని అన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాయ‌కులు

అహింసే ఆయుధంగా గాంధీజీ తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టారని, గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ రావు, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, బీరప్ప, శేఖర్, వెంకటేష్, సాయి యాదవ్, రాంబాబు, నాగేశ్వరరావు, విష్ణు, బాలకృష్ణ, వీరభద్ర రావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, లక్ష్మీ నారాయణ, భరత్, రఘు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here