పట్టణ‌ ప్రగతి తో మెరుగైన పారిశుద్య నిర్వహణ : మాదాపూర్ డివిజన్ ‌కార్పొరేటర్ వి.‌జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి :పట్టణ ప్రగతి కార్యక్రమంతో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరిచి బస్తీలు, కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.‌జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని చంద్రానాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ తండాలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ‌ ప్రగతి లో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు,‌ వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మధుసూధన్ రెడ్డి, చంద్ర నాయక్ బస్తి అధ్యక్షులు లాలూ నాయక్, హున్య నాయక్, రాము నాయక్, సత్య నాయక్, రవి నాయక్, కున్య నాయక్, రాందాస్, రామాంజనేయులు, శ్రీనివాస్ నాయక్, సుమన్ నాయక్, చందు నాయక్, నరేష్ నాయక్, ఈశ్వర నాయక్, రాములు నాయక్, మున్ను స్వామి, శ్రీనివాస్, లక్ష్మణ నాయక్, సురేష్ నాయక్, సునీల్ నాయక్, శంకర్ నాయక్, రాజేష్, వర్క్ ఇన్స్పెక్టర్లు శర్మ, చారి తదితరులు పాల్గొన్నారు.

చంద్రానాయక్ తండాలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొన్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here