- అవసరం లేకపోయిన సాకులు చెబుతూ రోడ్లపైకి జనాలు
- మాస్కులు, భౌతికదూరం మరచి భాద్యతారాహిత్యం
నమస్తే శేరిలింగంపల్లి: లాక్డౌన్ స్పూర్తికి విరుద్ధంగా ప్రజలు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసరాల కోసం ప్రభుత్వం నాలుగు గంటలు మినహయింపు ఇచ్చిన విషయం విదితమే. ఐతే ఆ నాలుగు గంటల్లో ఒక్కసారిగా ప్రజలంత బయటకు వస్తుండటంతో కొత్త ఇబ్బందులు తలెత్తున్నాయి. లింగంపల్లి తారానగర్ మార్కెట్లో ఆదివారం ఉదయం 8-9 గంటల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. అక్కడి నుండి బయట పడేందుకు అంబులెన్స్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చివరకు అడ్డంగా ఉన్న డివైడర్ దిమ్మలను వాహనదారుల సహాయంతో తొలగించి ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నారు.

ఇక 10 గంటల తర్వాత లాక్డౌన్ సమయంలోను చాలామంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై సంచరిస్తున్నారు. అవసరం లేకపోయినా ఏదో ఒక సాకు చెబుతూ రోడ్లపైకి వస్తున్నారు. దానికి తోడు చాలామంది కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు సైతం విస్మరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం లాంటి విషయాల్లోను నిర్లక్షం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంబులెన్స్ లకు దారి ఇవ్వాలనే కనీస ధర్మాన్ని మరచి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో మార్పు రానంతవరకు, స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని గుర్తెరగనంతవరకు లాక్డౌన్ వల్ల పెద్దగా ప్రయోజనం కలిగేలా కనిపించట్లేదు.
