కృష్ణ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీ మహిళ ప్రతినిధులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీని కాలనీకి చెందిన పలువురు మహిళలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కృష్ణ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, టీఆర్ఎస్ నాయకులు మొజేష్, కృష్ణ కాలనీ మహిళ ప్రతినిధులు రాణమ్మ, రాములమ్మ, సంగీత, విద్య, లక్ష్మీ, హైమవతి, రేవతి, రమాదేవి, పద్మ , ప్రమీల , కస్తూరి, పద్మావతమ్మ, రంగలక్ష్మి, అనంత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం అందజేస్తున్న కృష్ణకాలనీ మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here