పర్యావరణ పరిరక్షణ లో భాగస్వాములమవుదాం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో ఉచిత మట్టి గణపతి ప్రతిమలను ఆయన పంపిణి చేశారు. ప్రజలందరికి ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మట్టి గణపతులను పూజించి, పర్యావరణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. వివిధ రసాయనాలు కలిగిన రంగుల గణపతులను కాకుండా స్వచ్ఛమైన మట్టి గణపతులను పూజించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిర్మల, రూప రెడ్డి, మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, ఎల్లయ్య, డా రమేష్, గిరి గౌడ్, యాదగిరి, ప్రభాకర్, మంగలి కృష్ణ, సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లావణ్య, రాజా సింగ్, శ్యామల, జహంగీర్, దీపక్, ఎసార్పి రాజయ్య, ఎస్ఎఫ్ఏ వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here