మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: కార్పొరేటర్‌ గంగాధర్ రెడ్డి

నమస్తే ‌శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఉచిత మట్టి గణపతి ప్రతిమలను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పంపిణి చేశారు. ప్రజలందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మట్టి గణపతులను పూజించి, పర్యావరణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. పర్యావరణహితంగా పండుగ జరుపుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, నవోదయ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జీవన్ రాజు, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, హరీష్, శంకర్ యాదవ్, ప్రకాష్, రంగస్వామి, నరేష్, మూర్గ, కృష్ణా, ప్రశాంత్, మధు, వెంకటేష్, సాయి, గోవర్ధన్ నాయక్,‌ నరేందర్ నాయక్, జీవన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here