పేదింటి ఆడపిల్లకు కేసీఆర్ భరోసా – కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ పేదల‌ గుండెల్లో సీఎం‌ కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పెట్, చందానగర్, భారతీ నగర్ డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన 111 మంది లబ్ధిదారులకు కోటి 11 లక్షల 12, 876 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, తహశీల్దార్ వంశీ మోహన్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here