ఇజ్జ‌త్‌న‌గ‌ర్ వీక‌ర్ సెక్ష‌న్ స్మ‌శాన వాటిక స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజత్ నగర్ వికర్ సెక్షన్ స్మశానవాటికను స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి కార్పొరేట‌ర్ వి.జ‌గదీశ్వ‌ర్‌గౌడ్ శుక్ర‌వారం పరిశీలించారు. ఈ స‌ద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇజ్జ‌త్‌న‌గర్‌ వికర్ సెక్షన్‌లో నివాసముండే ప్రజలు ఎన్నో సంవత్సరలుగా ఇక్కడ ఖర్మకాండలు నిర్వహిస్తున్నార‌ని అన్నారు. ఐతే ఈ స్మ‌శాన వాటిక స్థ‌లం విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకువెళ్ల‌డం జ‌రిగింద‌న్నారు. గాంధీ ప్ర‌భుత్వ పెద్ద‌లతో మాట్లాడి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తార‌ని న‌మ్మ‌క‌ముంద‌ని అన్నారు. శ్మ‌శాన వాటికను కాపాడుకోవ‌డంతో పాటు అభివృద్ధికి కృషిచేస్తామ‌ని హామి ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు బ్రమయ్య యాదవ్, తైలి కృష్ణ, రామచందర్, రంగా స్వామి, నర్సింగ్ నాయక్, కృష్ణ నాయక్, సత్తి రెడ్డి, వెంకట్ స్వామి, రామకృష్ణా, నారాయణ, తర్య నాయక్, చక్రి,సీతమ్మ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

స్మ‌శాన వాటిక‌లో కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌కు విన‌తీ ప‌త్రం అంద‌జేస్తున్న స్తానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here