పరిసరాల పరిశుభ్రతే‌ పట్టణ ప్రగతి లక్ష్యం: హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ వి. పూజితజగదీశ్వర్ గౌడ్ నిర్వహించారు. పట్టణ ప్రగతి లో భాగంగా కాలనీలలో,‌ బస్తీలలో ఉన్న చెత్తను, మట్టి కుప్పలను తొలగించడం జరుగుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం‌ హరితహారం చేపట్టి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, డీఈ సురేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ సుబ్రమణ్యం రాజు, ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బల్లింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనక మామిడి వెంకటేష్ గౌడ్, నాయకులు మనోహర్ గౌడ్,చంద్ర శేఖర్, రమేష్ గౌడ్, మోసిన్, సాయి బాబా గౌడ్, సురేష్ గౌడ్, ఎం.డి బేగ్,‌ రాజు యాదవ్, బాల సుబ్బయ్య, రాజేశ్వర గౌడ్, అశోక్ గౌడ్, హర్ష, అప్పు, సంతోష్, మహిళలు రాధ, దేవి, పద్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

హుడా‌ కాలనీలో మొక్కలు నాటుతున్న కార్పొరేటర్లు‌ పూజితజగదీశ్వర్ గౌడ్, నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here