ఘనంగా స్వతంత్ర్య భారత వజ్రోత్సవ 4కె రన్ – ఉత్సాహంగా పాల్గొన్న యువత

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో‌ భాగంగా మాదాపూర్ మెటల్ చార్మినార్ నుండి బయో డైవర్సిటీ పార్క్ వరకు 4కె రన్ నిర్వహించారు. చందానగర్, శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జంట సర్కిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4కె రన్ లో ప్రముఖ సినీ నటులు నిఖిల్ హాజరై అందరినీ ఉత్సాహపరిచారు.

4కె రన్ లో పాల్గొన్న సినీ హీరో నిఖిల్

జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్లు సుధాంష్, వెంకన్న ఉదయం ఐదు గంటలకే మెటల్ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఉత్సాహంగా పాల్గొన్న వారందరికీ జాతీయ జెండాలను, టీ షర్టులను పంపిణీ చేశారు.

4కె రన్ లో పాల్గొన్న యువతీయువకులు

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయిన సుమారు 500 మంది, పోలీస్ శాఖ నుండి రన్నర్స్ పాల్గొని భారత్ మాతాకీ, జై భోలో స్వతంత్ర భారత్ కీ జై నినాదాలతో మార్మోగింది. 4కె రన్ నిర్వహించిన మార్గం లో అవాంతరాలు కలగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు పాటించారు. బయో డైవర్సిటీ ముగింపు వేదిక వద్ద రన్నర్స్ అందరికీ ప్రశంసా పూర్వకంగా మెడల్స్, అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శిల్పవల్లి, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లు తిరుపతి రావు, రవీంద్ర ప్రసాద్, తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల డీసీలు సుదాంష్, వెంకన్న
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here