ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే భార్యతో మనస్పర్థలు – మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: ప్రేమ వివాహం చేసుకున్న నాలుగు నెలలకే‌ భార్యతో మనస్పర్థలు ఏర్పడడంతో మనస్తాపానికి గురై ఓ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపిరెడ్డి నగర్ కు చెందిన ఆలకుంట్ల బాల్ రాజ్, అంబిక నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు నెలకొన్నాయి. పలుమార్లు వారి కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా వినకుండా గొడవ పడుతున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో మనస్తాపం చెందిన భర్త బాల్ రాజ్ శనివారం సాయంత్రం సమయంలో ఇంట్లో చున్నీతో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింట్లో ఉన్న దిలీప్ అనే వ్యక్తి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరి రూపానీ లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు బాల్ రాజ్ (పైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here