హ‌పీజ్‌పేట్ ఆరోగ్య కేంద్రంలో ఎక్జిట్‌ డోర్‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌లోని ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌడ్ సౌజ‌న్యంతో ఏర్పాటు చేసిన ఎక్జిట్‌ డోర్‌ను ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించిన గాంధీ అక్క‌డ కోరానా జ‌రుగుతున్న క‌రోనా ప‌రీక్ష‌లు, ఇత‌ర వైద్యసేవ‌ల గురించి వైద్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ క‌రోనా రెండ‌వ ద‌శ‌తో ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాలలో చికిత్స‌వ‌చ్చే రోగులు, కోవిడ్ టెస్టులు, వ్యాక్సినేష‌న్ కోసం వ‌చ్చే ప్ర‌జ‌ల సంఖ్య ఘ‌న‌నీయంగా పెరిగింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, స్థానిక నాయ‌కుల స‌హ‌కారం సైతం పొందుతున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో హ‌పీజ్‌పేట్ డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌతంగౌడ్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ఎక్జిట్ డోర్ ఏర్పాటు చేయించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. వారిని ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ పారా మెడిక‌ల్ ఆఫీస‌ర్ ర‌మేష్ నాయ‌క్‌, నాయకులు కాశినాథ్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎక్జిట్ డోర్‌ను ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, దాత బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌, వైద్యాధికారి విన‌య్‌బాబు
ప్ర‌భుత్వ విప్ గాంధీ, గౌత‌మ్‌గౌడ్‌ల‌కు హాస్పిట‌ల్‌లో అందిస్తున్న సేవ‌ల గురించి వివ‌రిస్తున్న వైద్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here