గుల్ మొహర్ పార్కులో జీహెచ్ఎంసీ అధికారుల పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ కాలనీ లో గల పార్కులో జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం పర్యటించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా శేరిలింగంపల్లి ఉప కమిషనర్ వెంకన్న, చందానగర్ ఉప కమిషనర్ సుధాంశు, గుల్ మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు షేక్ కాశీం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ తో పాటు ఈఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, డిప్యూటీ డైరెక్టర్ పి అనిల్ కుమార్, మేనేజర్ ఎండీ యూసుఫ్, హార్టికల్చరల్ గోపాల్, పి శివ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. గుల్ మొహర్ పార్కు కాలనీ అభివృద్ధితో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అహ్లాదవాతావరణంగా పార్కును తీర్చిదిద్దేందుకు అధికారులు పర్యటించడం పట్ల భేరి రాంచందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

గుల్ మొహర్ పార్కులో పర్యటిస్తున్న జీహెచ్ఎంసీ ‌అధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here