రక్తదానంతో ఒకరి ప్రాణం కాపాడొచ్చు: బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అని బిజెపి రాష్ట్ర నాయకులు ఎం రవికుమార్ యాదవ్ అన్నారు. బిజెపి సేవా సమర్పన్ అభియాన్ లో భాగంగా మాదాపూర్ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఎం రవికుమార్ యాదవ్, గంగల రాధాకృష్ణ యాదవ్ హాజరయ్యారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రభాకర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మధు యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీశైలం కురుమ, మదన చారి, వేణు, మహిళా మోర్చా పదాధికారులు శిరీష రెడ్డి, రామ దేవి, స్వప్న రెడ్డి, బీజేవైఎం నాయకులు ఆనంద్, చరణ్, నరేష్ రెడ్డి, పట్నం రాము, భాస్కర్, శివ, శ్రీధర్, లోకేష్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.

రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ ను అందజేస్తున్న రవికుమార్ యాదవ్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here