నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదోడి, కేశవ నగర్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఆదివారం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. గౌలిదోడి, కేశవ నగర్ లో అడుగడుగున కరోనా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోన ఉదృతి నేపథ్యంలో దర్గా వాసులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శంకర్ యాదవ్,కిషన్ సింగ్ పాల్గొన్నారు.
