గోపీ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపిచెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. డొయెన్స్ కాలనీ నుంచి చెరువు వద్దకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జేసీబీ సహాయంతో రోడ్డు మరమ్మత్తులు చేయించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here