జ‌ల‌మండలి, బ‌ల్దియా అధికారుల‌తో గోప‌న్‌ప‌ల్లిలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి విలేజ్‌లో నూతనంగా నిర్మిస్తున్న భూగ‌ర్భ డ్రైనేజీ, వరద నీటి కాలువ నిర్మాణ పనులను జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌ల‌సి స్థానిక కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్‌రెడ్డి సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ, వ‌ర‌ద‌నీటి కాల్వ‌ల నిర్మాణంతో గోప‌న్‌ప‌ల్లి ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని అన్నారు. వ‌ర్షాకాలం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అభివృద్ధి ప‌నుల్లో వేగం పెంచాల‌ని, నాణ్య‌తా ప్ర‌మాణాల విష‌యంలో రాజి ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి డీజీఎం సంధ్య రాణి, జీహెచఎంసీ శేరిలింగంపల్లి స‌ర్కిల్ డీఈ శ్రీనివాస్, ఏఈ కృషవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి, జ‌ల‌మండ‌లి డీజీఎం సంధ్యారాణి, డీఈ శ్రీనివాస్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here